YS Sharmila: ఉద్యోగాల కోసం తెలంగాణను తెచ్చుకున్న వారిని కొడతావా?: కేసీఆర్‌పై షర్మిల

  • అసెంబ్లీలో ఇచ్చిన వాగ్ధానం మేరకు 13,086 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
  • టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అడిగితే లాఠీతో కొడతారా? అని నిలదీత
  • అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవా.. సిగ్గుందా కేసీఆర్? అంటూ ఘాటు విమర్శ
Sharmila fires at KCR for lathi charge on students

ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న నిరుద్యోగులను కొడతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా యువత రక్తాన్ని కళ్ల చూస్తారా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా అనుసంధాన వేదిక ద్వారా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

భావి తరానికి పాఠాలు నేర్పే టీచర్ అభ్యర్థులపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం 13,086 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీలతో కొడతారా? సిగ్గుందా కేసీఆర్? నిండు అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవా? ఎన్నికల ముందు కూడా మాట మీద నిలబడవా? కొలువుల కోసం తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులను కొట్టే హక్కు నీకెక్కడిది? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా యువత రక్తాన్ని కండ్ల చూస్తావా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

నీ కుటుంబానికి ఐదు ఉద్యోగాలుంటే సరిపోతుందా? అని నిలదీశారు. 13,096 టీచర్ పోస్టులకు ముష్టి ఐదువేలు బిక్షం వేస్తావా? తొమ్మిదేళ్లుగా టీచర్ పోస్టుల ఊసే ఎత్తకుండా ఇప్పుడు నామమాత్రంగా పోస్టులు భర్తీ చేసి ఓట్లు దండుకుందామని చూస్తున్నావని ధ్వజమెత్తారు. మాట తప్పితే తల నరుక్కునే నైజమే ఉంటే, నరం మీద నాలుకే ఉంటే... వెంటనే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News