Chandrababu: మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది: చంద్రబాబు

Chandrababu said if TDP will open the gates YCP turns yellow
  • టీడీపీ జాతీయభావంతో ఉండే పార్టీ అని వెల్లడి
  • కేంద్రంతో ప్రత్యేక హోదా అంశంపైనే విభేదించానని స్పష్టీకరణ
  • ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని విమర్శలు
  • విభజన గాయాల కంటే దారుణంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆవేదన
టీడీపీ ఎప్పుడూ జాతీయ భావంతో ఉండే పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తాను కేంద్రంతో విభేదించింది కేవలం ప్రత్యేక హోదా అంశంపైనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా అంశాల్లో కేంద్రంతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పానని వివరించారు. 

ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద సమస్య జగన్ అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. టీడీపీ గేట్లు తెరిస్తే చాలు... వైసీపీ విలీనం అయిపోతుంది.... మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది అని వ్యాఖ్యానించారు.
Chandrababu
TDP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News