Bhairava Dweepam: 'భైరవద్వీపం' రీ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయింది!

  • ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి 50 ఏళ్లు
  • ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'భైరవద్వీపం' రీరిలీజ్
  • ఈ నెల 30న రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ
  • ఈ చిత్రానికి గ్లామర్ ను జోడించిన రోజా, రంభ
  • 9 నంది అవార్డులను సాధించిన 'భైరవద్వీపం'
Balakrishna Bhairava Dweepam re release

బాలకృష్ణ సినీ చరిత్రలో ఒక మరుపురాని చిత్రంగా 'భైరవద్వీపం' నిలిచిపోయింది. 1994లో విడుదల అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఏపీ మంత్రి రోజా బాలయ్యకు జోడీగా ఈ సినిమాకు మరింత గ్లామర్ ను జోడించారు. హీరోయిన్ రంభ ఈ చిత్రంలో ఓ గెస్ట్ క్యారెక్టర్ ను పోషించారు. 

మరోవైపు, బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 30 ఈ చిత్రం రీరిలీజ్ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన రీరిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. 4కే ఫార్మాట్ లో వస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఈ నెల 5నే విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, విజయకుమార్, శుభలేఖ సుధాకర్, బాబూ మోహన్, గిరిబాబు తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. 

చందమామ విజయ కంబైన్స్ పై బి.వెంకటరామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం... ఏకంగా 9 నంది అవార్డులను సాధించింది. బాలయ్య తాజా సినిమాల విషయాకి వస్తే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.

More Telugu News