రాఖీ పండగకు వెయ్యి స్పెషల్ బస్సులు: టీఎస్ఆర్టీసీ
- మూడు రోజుల పాటు వివిధ రూట్లలో స్పెషల్ సర్వీసులు
- బస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సిబ్బంది ఏర్పాటు
- అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన ఎండీ సజ్జనార్
ఈ నెల 29, 30, 31 తేదీలలో ప్రతీరోజూ వెయ్యి బస్సుల చొప్పున వివిధ రూట్లలో నడపనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. జంటనగరాల్లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్ స్టేషన్లలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాఖీ పౌర్ణిమ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.