Chandrayaan-3: చంద్రయాన్-3: శ్రీహరికోట నుంచి సాధించడం మరింత ప్రత్యేకమంటూ జగన్ ట్వీట్

  • బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 ప్రయోగం వీక్షించిన తెలంగాణ గవర్నర్
  • చంద్రుడిపై భారత్ అంటూ బండి సంజయ్ 
  • చారిత్రక విజయమన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Chandrayaan achieved from Sriharikota is much more special

చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన క్షణాలు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో వీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆదర్శ్ నగర్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 చారిత్రక ప్రయోగాన్ని వీక్షించినట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేయగా తమిళిసై రీట్వీట్ చేశారు.

భారత్‌కు అపురూపమైన విజయమని, చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు నేను, భారత ప్రజలు గర్విస్తున్నామని, ఇస్రోకు, అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ అపురూపమైన విజయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి అడుగుపడటం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు.

ఇప్పుడు చంద్రుడిపై భారత్ అంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్, ఆవిష్కరణ అన్వేషణలో భారత్ అతిగొప్ప విజయం సాధించిందంటూ పేర్కొన్నారు. ఇది చారిత్రక విజయమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు.

More Telugu News