Rajinikanth: అది నా అలవాటు.. సీఎం యోగికి పాదాభివందనం చేయడంపై రజనీకాంత్ వివరణ

Rajinikanth Explains Why He Touched Yogi Adityanaths Feet
  • సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ
  • యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ రజనీ వివరణ
  • జైలర్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన సూపర్ స్టార్

లక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. రజనీపై విమర్శలు వెల్లువెత్తాయి. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

ఈ ఉదంతంపై రజని తాజాగా స్పందించారు. సన్యాసులు, యోగులూ తన కంటే చిన్నవారైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటంటూ ఒక్క ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ ఈ మేరకు సమాధానం చెప్పారు. 2024 ఎన్నికలకు సంబంధించి మరో ప్రశ్న ఎదురవగా తాను రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం ‘జైలర్‌’ను ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News