Vande Bharat Express: విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్ రైలు.. వార్తల్లో నిజమెంత?

  • తమకు సమాచారం లేదన్న వాల్తేరు రైల్వే అధికారులు
  • చెన్నై నుంచి 16 బోగీలతో విశాఖకు బయలుదేరిన రైలు
  • విశాఖ-సికింద్రాబాద్ రైలుకు తరచూ సాంకేతిక సమస్యలు
  • ప్రత్యామ్నాయంగా దీనిని తెప్పిస్తున్నట్టు ప్రచారం
Railway Denies news that Vande Bharat rail between Visakha and Tirupati

విశాఖపట్టణం-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రవేశపెడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరినప్పటి నుంచీ ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే, వాల్తేరు రైల్వే అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు, ఇందుకు భిన్నమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు సాంకేతిక కారణాలతో తరచూ రద్దవుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు, రైలు రద్దయితే మరో రైలును వెంటనే అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే చెన్నై నుంచి రైలును తెప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

More Telugu News