Lovers: అడవిలో ఆత్మహత్య... మైనర్ ప్రేమ జంట విషాదాంతం

  • తిరుపతి జిల్లాలో ఘటన
  • కొంతకాలంగా ప్రేమించుకుంటున్న కల్యాణి, యుగంధర్
  • అడవిలో చెట్టుకు వేళ్లాడుతూ కనిపించిన మృతదేహాలు
  • పెళ్లి చేసుకుని ఉరేసుకున్నట్టు గుర్తించిన పోలీసులు!
Minor love duo commits suicide in Bakarapeta forest

ఏది నిజమైన ప్రేమో, ఏది వ్యామోహమో తెలియని వయసులో కొందరు టీనేజర్లు కన్నవారికి గుండెకోత మిగుల్చుతున్నారు. ప్రేమించుకున్న ఇద్దరు మైనర్లు తాజాగా అడవిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా భాకరాపేటలో జరిగింది. 

చౌడేపల్లి మండలం లద్దకానికి చెందిన యుగంధర్, రామసముద్రం మండలం చిట్టెంవారిపల్లెకు చెందిన కల్యాణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. 

అయితే, ఇవాళ భాకరాపేట అటవీప్రాంతంలో పశువుల కాపరులకు చెట్టుకు వేళ్లాడుతూ రెండు మృతదేహాలు కనిపించాయి. భయాందోళనలకు గురైన ఆ పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాలు ఎవరివి అని విచారణ జరపగా, యుగంధర్, కల్యాణిలవని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఆ మైనర్ ప్రేమికులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది తెలియరాలేదు. కాగా, ఘటన స్థలంలో ఆనవాళ్లను పరిశీలించిన అనంతరం, ఆ మైనర్లు పెళ్లి చేసుకుని, ఆపై ఉరేసుకున్నట్టు గుర్తించారు. ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

More Telugu News