Bandi Sanjay: కరీంనగర్ గల్లీలో పోరగాళ్లతో బండి సంజయ్ సైకిల్ విహారం... వీడియో ఇదిగో!

  • ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియామకం
  • సొంత నియోజకవర్గం కరీంనగర్ లో పర్యటన
  • పిల్లలతో సరదాగా ముచ్చటించిన కరీంనగర్ ఎంపీ
  • ఇష్టమైన ప్రదేశంలో, ఇష్టమైన ప్రజలతో... ఇంతకంటే ఆనందం ఏముంటుందని ట్వీట్
Bandi Sanjay cycling in Karimnagar streets

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి పదోన్నతి పొంది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ఆదివారం సొంత నియోజకవర్గంలో సేదదీరారు. కరీంనగర్ లో పర్యటించిన ఆయన ఓ గల్లీలో ఆడుకుంటున్న పిల్లలను పలకరించారు. వారితో సరదాగా ముచ్చటించారు. 

"నా పేరేంటి?" అంటూ ఓ బాలుడ్ని అడగ్గా... "సంజయ్" అంటూ ఆ బాలుడు వెంటనే చెప్పడంతో అందరూ నవ్వేశారు. అనంతరం బండి సంజయ్ ఆ బాలుడి నుంచి సైకిల్ తీసుకుని తొక్కారు. సైకిల్ వెనుక పిల్లల్ని ఆ వీధిలో సైక్లింగ్ చేశారు. అనంతరం నగరంలో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే పంచుకున్నారు. 

"నాదైన శైలిలో ఈ ఆదివారాన్ని ఆస్వాదించాను. ఈ భూమ్మీద నాకు అత్యంత ఇష్టమైన స్థలం కరీంనగర్ లో, నాకిష్టమైన ప్రజలతో హాయిగా గడిపాను. స్వచ్ఛమైన ఆనందం అంటే ఇదే" అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.

More Telugu News