కరీంనగర్ గల్లీలో పోరగాళ్లతో బండి సంజయ్ సైకిల్ విహారం... వీడియో ఇదిగో!

Bandi Sanjay cycling in Karimnagar streets
  • ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియామకం
  • సొంత నియోజకవర్గం కరీంనగర్ లో పర్యటన
  • పిల్లలతో సరదాగా ముచ్చటించిన కరీంనగర్ ఎంపీ
  • ఇష్టమైన ప్రదేశంలో, ఇష్టమైన ప్రజలతో... ఇంతకంటే ఆనందం ఏముంటుందని ట్వీట్
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి పదోన్నతి పొంది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ఆదివారం సొంత నియోజకవర్గంలో సేదదీరారు. కరీంనగర్ లో పర్యటించిన ఆయన ఓ గల్లీలో ఆడుకుంటున్న పిల్లలను పలకరించారు. వారితో సరదాగా ముచ్చటించారు. 

"నా పేరేంటి?" అంటూ ఓ బాలుడ్ని అడగ్గా... "సంజయ్" అంటూ ఆ బాలుడు వెంటనే చెప్పడంతో అందరూ నవ్వేశారు. అనంతరం బండి సంజయ్ ఆ బాలుడి నుంచి సైకిల్ తీసుకుని తొక్కారు. సైకిల్ వెనుక పిల్లల్ని ఆ వీధిలో సైక్లింగ్ చేశారు. అనంతరం నగరంలో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే పంచుకున్నారు. 

"నాదైన శైలిలో ఈ ఆదివారాన్ని ఆస్వాదించాను. ఈ భూమ్మీద నాకు అత్యంత ఇష్టమైన స్థలం కరీంనగర్ లో, నాకిష్టమైన ప్రజలతో హాయిగా గడిపాను. స్వచ్ఛమైన ఆనందం అంటే ఇదే" అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Bandi Sanjay
Cycle
Children
Karimnagar
BJP
Telangana
India

More Telugu News