తప్పయిందని చెప్పాకే లోకేశ్ విజయవాడకు రావాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి
- పాదయాత్రను అడ్డుకుంటే ఇన్నిరోజులు కొనసాగించేవాడా? అని ప్రశ్న
- చంద్రబాబు, లోకేశ్ ఉన్నప్పుడు విజయవాడకు ఏం చేశారని నిలదీత
- మా హయాంలో నగరానికి ఏం చేయలేకపోయామని చెప్పి అడుగుపెట్టాలి
విజయవాడలో అడుగుపెట్టే ముందు మా హయాంలో విజయవాడను నిర్లక్ష్యం చేశాం.. తప్పయిపోయిందని చెప్పిన తర్వాత రావాలన్నారు. కృష్ణ వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల కోసం చంద్రబాబు రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేకపోయాడో చెప్పాలన్నారు. విజయవాడ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జగన్ పాలనలో స్వచ్ఛ సురక్షలో విజయవాడ నగరానికి మూడో ర్యాంకు వచ్చిందని గుర్తు చేశారు.