Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

  • పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూకు జైలు శిక్ష
  • లాలూకు బెయిల్ ఇచ్చిన ఝార్ఖండ్ హైకోర్టు
  • బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
CBI files petition in Supreme Court requesting to cancel Lalu Prasad bail

పశుగ్రాసం కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. లాలూకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంను కోరింది. ఈ అప్పీల్ ను ఆగస్ట్ 25న లిస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మరోవైపు ఈ కేసులో గత ఫిబ్రవరిలో లాలూ ప్రసాద్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది.  

More Telugu News