తిరుమల నడక దారిలో చిరుతలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?: భానుప్రకాశ్ రెడ్డి
- టీటీడీ చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్న భాను ప్రకాశ్ రెడ్డి
- నెలన్నర కాలంలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్న
- ఎర్రచందనం స్మగ్లర్ల వల్ల చిరుతలు జనావాసాల వైపు వస్తున్నాయని వ్యాఖ్య
ఇంత జరుగుతున్నా ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ కానీ, మంత్రులు కానీ ఎందుకు స్పందించడం లేదని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వల్లే చిరుతలు అడవిలో నుంచి జనావాసాల వైపు వస్తున్నాయని అన్నారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపితే అధికార పార్టీ నేతల పేర్లు చాలా బయటకు వస్తాయని చెప్పారు. కొందరు నాయకులు, అధికారులకు కోట్లాది రూపాయలు వెళ్తున్నాయని అన్నారు.