Shree Swaminarayan Gurukul trust: సీఎం జగన్‌ను కలిసిన శ్రీస్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు

  • ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు
  • విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఏర్పాటుకు ట్రస్ట్ అంగీకారం
  • తిరుపతిలో స్కూల్ శంకుస్థాపనకు రావాలని జగన్‌కు ఆహ్వానం
Shree Swaminarayan Gurukul International School members meet CM Jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ ట్రస్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన ట్రస్ట్ సభ్యులు... సెప్టెంబర్ నెలలో తిరుపతి స్కూల్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.

More Telugu News