Vishwak Sen: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!

  • విష్వక్సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
  • ఆయన సరసన సందడి చేయనున్న నేహా శెట్టి 
  • ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే కథ
  • డిసెంబర్ 8వ తేదీన సినిమా విడుదల
Gangs Of Godavari movie lyrical song released

విష్వక్సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా రూపొందుతోంది. సితార నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. గోదావరి జిల్లాల్లోని గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. కథానాయికగా నేహా శెట్టి అలరించనుంది. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'అద్దాల ఓణీలా .. ఆకాశవాణిలా, గోదావరి గట్టుపై మెరిశావు మణిలా' అంటూ ఈ పాట సాగుతోంది. గోదావరిలో పడవ ప్రయాణంతో ఈ పాట మొదలై .. పల్లె అందాల నడుమ సాగుతోంది. పక్కా మాస్ లుక్ తో విష్వక్ చేస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి. 

యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా .. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. గోదావరి తీరప్రాంతంలో జరిగే ఇసుక మాఫియా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News