Chandrababu: బండారు దత్తాత్రేయను కలిసిన చంద్రబాబు దంపతులు

  • హర్యానా రాజ్ భవన్‌లో మర్యాదపూర్వక కలయిక
  • వ్యక్తిగత పర్యటనలో భాగంగా 11న చండీగఢ్ వెళ్లిన బాబు
  • నేటి సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి రాక
Chandrababu meets Bandaru Dattatreya

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. హర్యానా రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా చంద్రబాబు, భువనేశ్వరి కలిశారు. వ్యక్తిగత పర్యటన మీద చంద్రబాబు కుటుంబ సభ్యులు మూడురోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 11న చండీగఢ్ వెళ్లారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

More Telugu News