త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తమ్ముడు
- రేపటి ఇండిపెండెన్స్ డేకు సిద్ధమవుతున్న యావత్ దేశం
- కశ్మీర్ లోని సోపోర్ లో జాతీయ జెండాను ఎగుర వేసిన రయీస్
- తన సోదరుడు కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నానన్న రయీస్
కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తన సోదరుడు కూడా తాను ఎంచుకున్న మార్గాన్ని వదిలి వెనక్కి రావాలని రయీస్ కోరాడు. ఎంతో భావోద్వేగంతో తాను జెండాను ఎగురవేస్తున్నానని చెప్పాడు. 2009లో తన సోదరుడు ఉగ్రవాదం వైపు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి ఆయన తిరిగి రాలేదని, ఒకవేళ ఆయన బతికుంటే తిరిగి రావాలని కోరుకుంటున్నానని అన్నాడు. పాకిస్థాన్ శక్తిహీనం అయిందని... తాము నిజమైన భారతీయులుగా తమ మాతృభూమిలోనే నివసిస్తామని చెప్పాడు.