ప్రధానికి పచ్చడి పంపిన మహిళకు స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనేందుకు ఆహ్వానం
- ఈమారు స్వాతంత్ర్య దినోత్సవంలో సామాన్యులూ పాల్గొనేందుకు అవకాశం
- ప్రధాని లక్ష్యానికి అనుగూణంగా ‘జన్ భాగియదారీ’ కార్యక్రమం
- ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రత్యేక అహ్వానాలు
- ప్రధానికి ఆపిల్ పచ్చడి పంపిన మహిళకు దక్కిన అపూర్వ అవకాశం
అయితే, ప్రధానికి ఆపిల్ పళ్ల పచ్చడిని పంపించిన ఓ ఉత్తరాఖండ్ మహిళ కూడా ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఉత్తరకాశీ జిల్లాకు చెందిన సునీత రౌతేలా తన భర్త భరత్ సింగ్ రౌతేలాతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంటారు. భరత్ సింగ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీఓ) లబ్ధిదారు. ఇటీవల ఈ సంస్థ తయారు చేసిన ఆపిల్ పళ్ల చట్నీని భరత్ సింగ్ భార్య ప్రధానికి పంపించారు. ఆ తరువాత కొద్ది రోజులకు, భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలంటూ ఎఫ్పీఓకు ప్రధాని కార్యాలయం నుంచి లేఖ అందింది. ఈ లేఖలో యాపిల్ చట్నీ ప్రస్తావన కూడా ఉండటంతో భరత్ సింగ్ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తన భార్యతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. సునీత రౌతేలా తన గ్రామానికి చెందిన 162 మంది రైతులను ఏకంచేసి ఈ ఎఫ్పీఓను ఏర్పాటు చేశారు.