Rajinikanth: స్వామీజీ చెబితే.. సినిమా హిట్ అయిపోయినట్టే: రిషికేశ్‌లో రజనీకాంత్

  • హిమాలయాల యాత్రకు వెళ్లిన రజనీకాంత్
  • బద్రీనాథ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు
  • స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శించిన సూపర్ స్టార్
  • సినిమా విజయం అందుకుంటుందని చెప్పారని వెల్లడి
rajinikanth visits badrinath temple to offer prayers after jailer release

సౌతిండియా సూపర్‌‌స్టార్ రజనీకాంత్.. ‘జైలర్’ సినిమా విడుదలకు ముందు హిమాలయాల యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా బద్రీనాథ్ ఆలయానికి వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు.

మరోవైపు రిషికేశ్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని రజనీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అంచనాల మధ్య జైలర్ విడుదలైంది. ‘కంగారుపడొద్దు.. సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది’ అని స్వామీజీ చెప్పారు. ఆయనే స్వయంగా ఆ మాట చెప్పారంటే జైలర్ హిట్ అయినట్టే” అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెల్సన్ దిలీప్‌కుమార్‌‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘జైలర్’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల వసూళ్లు సాధించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో రజనీతోపాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు నటించారు.


More Telugu News