Stock Market: ఈరోజు కూడా మార్కెట్లకు నష్టాలే!

  • 365 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 114 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 365 పాయింట్లు కోల్పోయి 65,322కి దిగజారింది. నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 19,428కి పడిపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.95%), టైటాన్ (0.88%), రిలయన్స్ (0.49%), అల్ట్రాటెక్ సిమెంట్స్ (0.30%). 

టాప్ లూజర్స్:     
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), ఎన్టీపీసీ (-2.02%), సన్ ఫార్మా (-1.59%), ఏసియన్ పెయింట్స్ (-1.52%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.39%).

More Telugu News