మేం వాకౌట్ చేశాకే మణిపూర్పై మోదీ మాట్లాడారు.. విరుచుకుపడిన విపక్షాలు
- ప్రసంగంలో మొదటి 90 నిమిషాలు మణిపూర్ ఊసే ఎత్తలేదన్న టీఎంసీ ఎంపీ
- ఈ దెబ్బతో ‘ఇండియా’ విజయంపై నమ్మకం కుదరిందని వ్యాఖ్య
- మోదీ ‘కాంగ్రెస్ ఫోబియా’తో బాధపడుతున్నారన్న ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్
‘‘మీరేసుకున్న టెఫ్లాన్ పూత పోయింది. మెరుపు మాయమైంది. ఈ రోజు మీ ప్రసంగం తర్వాత భారత్ను ‘ఇండియా’ గెలుస్తుందన్న నమ్మకం కలిగింది’’ అని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల మొత్తం ప్రధాని మోదీ రాజ్యసభకు డుమ్మా కొట్టారని ఒబ్రెయిన్ విమర్శించారు. మణిపూర్పై లోక్సభలో ఆయన నాలుగంటే నాలుగే నిమిషాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. అది కూడా ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప ఆయన మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి మించి మరెవరూ పార్లమెంటను ఇంతగా అవమానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కూడా మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మోదీ తన ప్రసంగం మొత్తాన్ని కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఆయనకు ‘కాంగ్రెస్ ఫోబియా’ పట్టుకుందని ఎద్దేవా చేశారు. మోదీ రెండు గంటలు మాట్లాడితే అందులో చాలావరకు సమయాన్ని మణిపూర్ గురించి కాకుండా కాంగ్రెస్ను తిట్టడానికే వినియోగించుకున్నారని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు.