Nuego: హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒక్క రూపాయే చార్జి.. ఎందుకు? ఎప్పుడో తెలుసా?

  • పర్యావరణహిత ప్రయాణాలపై అవగాహన కోసం ‘న్యూగో’ సంస్థ ఆఫర్
  • ఆగస్టు 15న ప్రయాణించే అవకాశం
  • దేశవ్యాప్తంగా తమ సేవలు అందుబాటులో ఉన్న ప్రతిచోటా ఆఫర్ వర్తిస్తుందన్న సంస్థ
Nuego offers Hyderabad to Vijayawada journey ticket for One rupee

అవును!  మీరు విన్నది నిజమే. రూపాయి మాత్రమే చెల్లించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటును ఇంటర్-సిటీ ఎలక్ట్రిక్ సేవలు అందించే ‘న్యూగో’ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న ఆ సంస్థ బస్సులు ప్రయాణించే మార్గాల్లో ఎక్కడినుంచి ఎక్కడైనా రూపాయితో ప్రయాణించవచ్చంటూ బంపరాఫర్ ప్రకటించింది. 

ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందేందుకు ఇప్పటికే బుకింగ్స్ మొదలైనట్టు గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈవో దేవేంద్ర తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ సేవలు కొనసాగుతాయని తెలిపారు. 

ఇండోర్-భోపాల్, ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-తిరుపతి, చెన్నై-తిరుపతి, చెన్నై-పుదుచ్చేరి మార్గాల్లో సేవలు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. రూపాయి ఆఫర్ దేశమంతా వర్తిస్తుందని పేర్కొన్న ఆయన బుకింగ్స్ కోసం న్యూగో వెబ్‌సైట్ https://nuego.in/bookingతోపాటు తమ సంస్థ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

More Telugu News