అక్రమ కేసులకు భయపడం.. చంద్రబాబు సహా అందరం ఇక్కడే ఉన్నాం.. దమ్ముంటే అరెస్టు చేసుకోండి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి సవాల్
- రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న భూమిరెడ్డి
- ప్రజల కోసం తాము జైలుకెళ్లేందుకైనా సిద్ధమేనని ప్రకటన
- కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని వ్యాఖ్య
ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తేవాలని చంద్రబాబు పర్యటిస్తున్నారని, ఈ క్రమంలో వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కానీ కేసులు తమపై పెడుతున్నారని మండిపడ్డారు. అంగళ్లు దాడులకు పోలీసులే సాక్ష్యమని, వారికీ దెబ్బలు తగిలాయని చెప్పారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం తాము జైలుకెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై నమోదైన కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పారు.