Mohan Lal: మైసూరులో 'వృషభ' యాక్షన్ సన్నివేశాలు... సెట్స్ పైకి మోహన్ లాల్

  • హెలికాప్టర్ లో మైసూరు చేరుకున్న మోహన్ లాల్
  • నందకిశోర్ దర్శకత్వంలో వృషభ
  • చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు
  • వృషభ టీమ్ లో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో భాగస్వామ్యం
Mohan Lal enters on Vrushabha sets at Mysore

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం వృషభ. హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మైసూరులో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం నటుడు మోహన్ లాల్ సెట్స్ పై అడుగుపెట్టారు. ఆయన ఇవాళ హెలికాప్టర్ లో మైసూరు చేరుకున్నారు. 

హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో వృషభ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడంతో సినిమా రేంజి మరింత పెరిగింది. ఈ సినిమాకు నందకిశోర్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిలింస్, ఏవీఎస్ స్టూడియోస్ వంటి బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాయి. 

ఈ చిత్రంలో మోహన్ లాల్, రోషన్ మేకా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, షనాయా కపూర్, జహ్రాఖాన్, రాగిణి ద్వివేది తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More Telugu News