Revanth Reddy: నేను చంద్రబాబు శిష్యుడిని కాదు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy says he is not Chandrababu follower
షార్ట్స్‌లో చూడండి
డ్రగ్స్ కేసు విషయంలో తాము పిల్ వేసి కోర్టులో పోరాడామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... డ్రగ్స్ కేసులో కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకుంటే కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. 

తాను చంద్రబాబు నాయుడి శిష్యుడిని అని చెప్పడంపై కూడా రేవంత్ స్పందించారు. తాను శిష్యుడిని కాదని, టీడీపీ అధినేతకు సహచరుడిగా పని చేశానన్నారు. తాను ఎప్పుడూ తెలంగాణ పక్షానే నిలిచానని చెప్పారు. ఇప్పటి వరకు తాను పాలకులతో కలిసి ఏ ప్రభుత్వంలో లేనని చెప్పారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Chandrababu
KCR

More Telugu News