Electricity: ఏపీలో ఈ నెల 10 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

  • ఏపీ విద్యుత్ రంగంలో సమ్మె సైరన్
  • విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ చర్చలు విఫలం
  • ఈ నెల 8న విజయవాడలో మహాధర్నా
  • జేఏసీ ప్రకటన
AP Electricity employees set to go for indefinite strike

ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగుల్లో అసంతృప్తి రాజుకుంది. తమ సమస్యలపై విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో, జేఏసీ నిరవధిక సమ్మెకు నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలి రావాలని జేఏసీ పేర్కొంది.

More Telugu News