Bandi Sanjay: ఏపీ బీజేపీ ఇన్ఛార్జీగా బండి సంజయ్ అంటూ ప్రచారం!

  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్
  • జాతీయ కార్యవర్గం నుంచి సునీల్ దేవధర్ తొలగింపు
  • ఏపీ ఇన్ఛార్జీగా సునీల్ స్థానంలో సంజయ్ ను నియమిస్తారంటూ ప్రచారం
Bandi Sanjay likely to be BJP incharge of Andhra Pradesh

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. నిన్న ప్రకటించిన ఈ జాబితాలో దక్షిణాది నుంచి కేవలం బండి సంజయ్ కు మాత్రమే అవకాశం దక్కింది. మరోవైపు బండి సంజయ్ కు సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 

ఏపీ బీజేపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమించబోతున్నారనేదే ఆ ప్రచారం. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జీగా ఉన్న సునీల్ దేవధర్ ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దీంతో ఆయన స్థానంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జీగా మరో నాయకుడిని నియమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. 

ఏపీ ఇన్ఛార్జీగా సంజయ్ ను నియమిస్తే... వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ బలం పెరుగుతుందనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తేలాల్సి ఉంది.

  • Loading...

More Telugu News