Pawan Kalyan: కావలిలో 'బ్రో' సినిమా నిలిపివేత... గూడూరులో ఫ్లెక్సీల వివాదం

  • పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో 'బ్రో'
  • ఈరోజు థియేటర్లలో విడుదలైన చిత్రం
  • సినిమాకు హిట్ టాక్ రావడంతో ఆనందంలో ఫ్యాన్స్
Bro movie show stopped in Kavali

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఇప్పటికే హిట్ టాక్ ను తెచ్చుకుంది. మరోవైపు సినిమా థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉంది. ఇంకోవైపు కావలిలోని లతా థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. థియేటర్ లో సౌండ్ సిస్టం ఫెయిల్ కావడంతో థియేటర్ యాజమాన్యం షోను ఆపేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద రచ్చ చేశారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు, థియేటర్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. థియేటర్ వద్దకు వచ్చిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇంకోవైపు గూడూరులోని సింగం థియేటర్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సినిమా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పవన్ ఫ్యాన్స్ లో రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. దీంతో, మధ్యలో కల్పించుకున్న థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను చించేసింది. ఇది పవన్ ఫ్యాన్స్ రెండు వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. రెండు వర్గాలు కలిసి మూకుమ్మడిగా థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో, థియేటర్ యాజమాన్యం మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

More Telugu News