Telangana: రైలు చక్రాలకూ సిబ్బంది తాళం!

  • భారీ వర్షాలకు గురువారం ఉద్ధృతంగా ప్రవహించిన వడ్డేపల్లి చెరువు
  • ముందు జాగ్రత్తగా గూడ్స్‌ రైలు కాజీపేట టౌన్ స్టేషన్‌లో నిలిపివేత
  • రైలు బ్రేకులను లాక్ చేసి, చక్రాలను గొలుసుతో పట్టాలకు కట్టేసిన సిబ్బంది
Train wheels tied to tracks in kazipet station

ఇళ్లు, భవనాలు, గోదాములు.. ఇలా ఎన్నింటికో తాళాలు వేయడం మనకు తెలిసిందే. కానీ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైలు చక్రాలకూ తాళం వేయాల్సి వచ్చింది. హనుమకొండలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లాలోని వడ్డేపల్లి చెరువు గురువారం ఉద్ధృతంగా ప్రవహించడంతో అటువైపుగా వెళ్లాల్సిన గూడ్సు రైలును కాజీపేట టౌన్ స్టేషన్‌లోనే నిలిపివేశారు. ఈ క్రమంలో రైలు బ్రేకులను లాక్ చేయడంతో పాటు సిబ్బంది ముందు జాగ్రత్తగా చక్రాలను ఇనుప గొలుసులతో పట్టాలకు కట్టి తాళం వేశారు.

More Telugu News