Rs 28 Laks: టిఫిన్ కోసం బస్సు దిగితే.. రూ. 28 లక్షలు కొట్టేశారు

  • విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా చోరీ
  • నార్కెట్ పల్లిలో టిఫిన్ కోసం బస్సు దిగిన బాధితుడు
  • రూ. 28 లక్షలు ఉన్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లిన దొంగలు
Robbers robbed Rs 28 laks when a man got down from bus for tiffin

నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. టిఫిన్ చేద్దామని బస్సు దిగిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను దొంగలు కొట్టేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బాధితుడు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్కెట్ పల్లిలో టిఫిన్ కోసం ఆయన బస్సు దిగారు. ఆ సమయంలో బ్యాగ్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. బ్యాగ్ లో రూ. 28 లక్షలు ఉన్నాయి. ఈ ఘటనతో బాధితుడు లబోదిబోమన్నాడు. నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

More Telugu News