ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్.. ఆయన గురించి కొన్ని వివరాలు!
- ఈ నెల 5న జస్టిస్ ధీరజ్ సింగ్ పేరును సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
- సీజేఐ చంద్రచూడ్ ను సంప్రదించి ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి
- మాజీ సీజేఐ తీరథ్ సింగ్ తమ్ముడే జస్టిస్ ధీరజ్ సింగ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరథ్ సింగ్ ఠాకూర్ తమ్ముడే జస్టిస్ ధీరజ్ సింగ్. వీరి తండ్రి దేవీదాస్ ఠాకూర్ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ... సుప్రీంకోర్టు న్యాయవాదిగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పని చేశారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ స్వరాష్ట్రం జమ్మూకశ్మీర్. 1989 అక్టోబర్ లో ఢిల్లీ, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ అడ్వొకేట్ గా పదోన్నతి పొందారు. 2013 మార్చిలో జమ్మూకశ్మీర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ లో బాంబే హైకోర్టుకు బదిలీ అయి ప్రస్తుతం అక్కడే సేవలు అందిస్తున్నారు.