నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడి అనూహ్య మరణం
- ఛత్తీస్ఘడ్ కోర్బా జిల్లాలో ఘటన
- బిడ్డను మంచంపై పడుకోబెట్టి ఇంటిపనుల్లో నిమగ్నమైన తల్లి
- ఈలోపు బాలుడి నోట్లో బల్లి పడటంతో ఊపిరాడక చిన్నారి మరణం
కాగా, ఆమె ఓమారు బిడ్డ వద్దకు రాగా బాలుడు అచేతనంగా కనిపించాడు. బిడ్డ నోట్లో బల్లి కనిపించింది. దీంతో, భయపడిపోయిన మహిళ పెద్ద పెట్టున రోదించడంతో స్థానికులు వచ్చి చూసి చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. అయితే, బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతుశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే స్పష్టం చేశారు. బల్లి శ్వాసకోశ నాళానికి అడ్డం పడటంతో ఊపిరాడక చిన్నారి మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. పోస్ట్మార్టం తరువాతే అసలు కారణం ఏంటో వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.