Tirumala: తిరుమల ఘాట్ రోడ్లపై ఆగని ప్రమాదాలు... కర్ణాటక భక్తుల కారు బోల్తా

  • మొదటి ఘాట్ రోడ్డుపై ఘటన
  • 16వ మలుపు వద్ద అదుపు తప్పిన కారు
  • కారులో నలుగురు వ్యక్తులకు గాయాలు
  • తిరుపతి ఆసుపత్రికి తరలింపు
Car overturns on Tirumala ghat road

ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం సంభవించింది. 16వ మలుపు వద్ద ఓ కారు బోల్తాపడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని కర్ణాటకకు చెందిన భక్తులుగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద ఘటనపై ఇతర వాహనదారులు టీటీడీకి సమాచారం అందించారు. వెంటనే అధికారులు స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్స్ ల ద్వారా తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మలుపు వద్ద డ్రైవర్ కారును అదుపు చేయలేకపోవడంతో బోల్తా పడినట్టు భావిస్తున్నారు.

More Telugu News