Pawan Kalyan: అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan responds on fatal road accident in Annamayya district
  • పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
  • ఆరుగురి దుర్మరణం
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
  • వేగ నియంత్రణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడి
అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కడప నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట వద్ద లారీ ఢీకొన్న ఘటన బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. 

ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని, తగిన ఆర్థిక సహాయం అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. 

సిమెంటు లోడుతో వెళుతున్న లారీ అతివేగంగా దూసుకురావడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని మీడియా ద్వారా తెలిసిందని అన్నారు. పోలీసు, రవాణ శాఖల అధికారులు రహదారి భద్రత చర్యల్లో భాగంగా వేగ నియంత్రణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జనసేనాని పేర్కొన్నారు.
Pawan Kalyan
Road Accident
Pullampeta
Annamayya District

More Telugu News