Manipur Violence: మణిపూర్‌లో మరో దారుణం.. వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీత

  • రావణకాష్ఠంలా రగులుతున్న మణిపూర్
  • కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలు
  • మణిపూర్ పరిస్థితులకు అద్దం పడుతున్న వీడియోలు
Manipur Violence Video of Beheading Surfaces Amid Ongoing Unrest

జాతుల మధ్య ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుతున్న మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని చంపిన ఓ వర్గం ప్రజలు అతడి మొండెం నుంచి తలను వేరు చేసి దానిని కంచెకు తగిలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో నిన్న వైరల్ అయింది.

బిష్ణుపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ నెల 2న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అదే రోజు రాత్రి జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కంచెకు వేలాడదీసిన తలను డేవిడ్‌దిగా గుర్తించారు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా ఈ వీడియో బయటకు రావడం మణిపూర్‌లోని భయంకర పరిస్థితులకు అద్దంపడుతోంది. కాగా, ఘర్షణలు మొదలైన మే 3 నుంచి ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News