ముగ్గురు కలిసి వచ్చినా, ఇద్దరు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు నిలవలేరు: వైవీ సుబ్బారెడ్డి
- పవన్ ఎప్పుడూ ముగ్గురం కలిసి వస్తామని అంటారని వైవీ వ్యాఖ్య
- ఎప్పుడూ ఒక్కరే కనిపిస్తున్నారని ఎద్దేవా
- ముగ్గురి పొత్తు గురించి బీజేపీ మాట్లాడాలన్న వైవీ
టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటి నుండి భావిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ను గద్దె దింపాలంటే ఈ మూడు పార్టీలు ఏకం కావాలని అంటున్నారు. పవన్ బీజేపీ, టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, టీడీపీ-బీజేపీ మధ్య మాత్రం పొసగడం లేదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.