Pekamedalu: 'బాహుబలి', 'ఎవరికి చెప్పొద్దు' ఫేమ్ రాకేశ్ వర్రే నిర్మాణంలో వస్తున్న 'పేకమేడలు' ఫస్ట్ లుక్

  • యువ నటుడు రాకేశ్ వర్రే తెరకెక్కించిన 'పేకమేడలు'
  • హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న వినోద్ కిషన్, అనూష కృష్ణ
  • టైటిల్ మాదిరే వైవిధ్య భరితంగా ఉన్న ఫస్ట్ లుక్
Pekamedalu movie first look

'బాహుబలి' చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేశ్ వర్రే. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో తానే కథానాయకుడిగా 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమాను నిర్మించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే బ్యానర్ పై కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ 'పేకమేడలు' అనే చిత్రాన్ని రాకేశ్ వర్రే నిర్మించారు. ఈ సినిమా ద్వారా వినోద్ కిషన్, అనూష కృష్ణలు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. 'నా పేరు శివ' తదితర చిత్రాల్లో వినోద్ కిషన్ కీలక పాత్రలను పోషించాడు. అనూషకు ఇదే తొలి చిత్రం. మరోవైపు ఈ చిత్రం ద్వారా నీలగిరి మామిళ్ళ అనే నూతన దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతుండటం విశేషం. 

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ మాదిరే ఫస్ట్ లుక్, పోస్టర్ వైవిధ్యంగా ఉన్నాయి. హైదరాబాద్ బస్తీ, సిటీని కలగలిపిన 360 డిగ్రీలో ఉన్న ఫొటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెనట్టుగా కథానాయకుడు వినోద్ కిషన్ ఉన్నాడు. లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని, సగం తొడుక్కున్న చొక్కాతో, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్నాడు. డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాకు స్మరన్ సంగీతాన్ని అందించారు. ఒక యూనిక్ స్టోరీలైన్ తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.



More Telugu News