యూసీసీపై ఏపీ సీఎం జగన్ ను కలిసిన ముస్లిం ప్రతినిధులు
- కేంద్రం తెచ్చే యూసీసీని వ్యతిరేకించాలని సీఎంను కోరిన ప్రతినిధులు
- యూసీసీ డ్రాఫ్ట్ రాలేదని వ్యాఖ్యానించిన సీఎం జగన్
- యూసీసీపై దుష్ప్రచారం జరుగుతోందన్న ఉపముఖ్యమంత్రి
యూసీసీపై దుష్ప్రచారం
కనీసం డ్రాఫ్ట్ కూడా జరగని యూసీసీపై దుష్ప్రచారం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ పాషా అన్నారు. ఈ బిల్లులో మైనార్టీ హక్కులకు భంగం వాటిల్లితే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. యూసీసీ వల్ల ప్రయోజనం ఎంత? నష్టం ఎంత? అనే అంశాలపై ఆలోచించాలని, ఇవన్నీ డ్రాఫ్ట్ వచ్చాక తెలుస్తాయన్నారు. యూసీసీలో ఏ అంశాలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. మైనార్టీలకు విఘాతం కలిగించే బిల్లులను వ్యతిరేకిస్తామని జగన్ స్పష్టం చేశారన్నారు.