Dog: యానాంలో హృదయాలను మెలితిప్పే దృశ్యం... ఆత్మహత్య చేసుకున్న యజమానురాలు తిరిగొస్తుందని చెప్పుల వద్దే కూర్చున్న శునకం

  • గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలో దూకిన యువతి
  • చెప్పులు బ్రిడ్జిపైనే విడిచిన వైనం
  • యజమానురాలు ఇక లేదన్న విషయం తెలియని శునకం
  • పగలు రాత్రి ఆ చెప్పుల వద్దే కాపలా
Dog waiting for her owner who committed suicide

శునకాలు ఎంతటి విశ్వాసపాత్రమైనవో, ఎంతటి ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యజమానులతో వాటి అనుబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ ఘటన చెబుతుంది. యానాంలో ఇటీవల ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి నది బ్రిడ్జిపైకి వెళ్లిన ఆ యువతి, చెప్పులు విడిచి నదిలో దూకి బలవన్మరణం చెందింది. ఆ సమయంలో యువతి పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది. అయితే, యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషయం తెలియని ఆ మూగప్రాణి ఆ చెప్పుల వద్దే కూర్చుని ఎదురుచూస్తోంది. రాత్రి పగలు ఆ శునకం చెప్పుల వద్దే కూర్చుని ఉండడం గమనించినవారు చలించిపోతున్నారు.

More Telugu News