టీడీపీ, బీజేపీలతో పొత్తుపై ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న పవన్
- సీఎం ఎవరనేది ఫలితాలను బట్టి నిర్ణయిస్తామని వ్యాఖ్య
- వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో పొత్తులపై చాలా వరకు క్లారిటీ వచ్చినట్టయింది. టీడీపీతో కలిసి పోటీ చేస్తామనే విషయాన్ని ఇప్పటి వరకు పవన్ ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే, ఢిల్లీ వేదికగా పొత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయే పరిస్థితి ఉంది. మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.