Pawan Kalyan: శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం

  • వివాదాస్పద సీఐగా గుర్తింపు తెచ్చుకున్న అంజూ యాదవ్
  • ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ధర్నా
  • జనసేన నేత సాయి చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజూ యాదవ్
  • ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పవన్ కల్యాణ్
  • సోమవారం నాడు తిరుపతి రానున్న జనసేనాని
Pawan Kalyan decides to complain against Srikalahasti CI Anju Yadav

తన చర్యలతో పలుమార్లు వివాదాస్పదమైన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఇటీవల జనసేన నేత సాయి చెంప చెళ్లుమనిపించడం తెలిసిందే. ఈ విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. పవన్ సోమవారం నాడు తిరుపతి రానున్నారు. 

ఈ సందర్భంగా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించనున్నారు.

పవన్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ కొన్నిరోజుల కిందట శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు పెళ్లిమండపం జంక్షన్ లో ధర్నాకు దిగారు. జనసేన కార్యకర్తలు సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగానే జనసేన నేత సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు.

More Telugu News