BRO: 'బ్రో' నుంచి రెండో పాటకు రంగం సిద్ధం

  • పవన్, సాయితేజ్ ముఖ్యపాత్రల్లో బ్రో
  • సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో
  • జులై 28న గ్రాండ్ రిలీజ్
  • రేపు తిరుపతి ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ లో జాణవులే పాట రిలీజ్
BRO second single will release tomorrow

పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధానపాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ వినోదాత్మక చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఇటీవలే మైడియర్ మార్కండేయ అంటూ తొలి సింగిల్ ను వదిలిన బ్రో చిత్రయూనిట్ ఇప్పుడు రెండో పాటకు రంగం సిద్ధం చేసింది. జాణవులే అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను రేపు తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ లో ప్రేక్షకుల నడుమ లాంచ్ చేయనున్నారు. జులై 15న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ వేడుక షురూ కానుంది. 

ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ బ్రో చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 

More Telugu News