ఏపీ బీజేపీలో ఎలాంటి వర్గాలు లేవు: పురందేశ్వరి
- ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకున్న పురందేశ్వరి దంపతులు
- రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్న పురందేశ్వరి
- పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సహకారం తీసుకుంటానని వ్యాఖ్య
ఈ నెల 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ హైకమాండ్ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది.