Dr BR Ambedkar Konaseema District: భర్తను చెంబుతో కొట్టి హత్య చేసిన భార్య

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లంకలో వెలుగు చూసిన ఘటన
  • భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ
  • భర్త వేధింపులు తాళలేక హత్య 
  • పోలీసుల ముందు లొంగిపోయిన నిందితురాలు
Wife kills husband by hitting him with ewer in ambedkar konaseem district

తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక కడతేర్చిందో భార్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ ఘటన వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఇసుకపట్ల రామకృష్ణ(34) రోజూ తాగొచ్చి భార్యతో పాటూ తల్లిదండ్రులపైనా చేయి చేసుకునేవాడు. భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ ఇటీవల ఓ రోజు అతడి తలపై చెంబుతో బలంగా కొట్టి చంపేసింది. భర్త హింసను భరించలేకే అతడిని కడతేర్చినట్టు ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయింది.

More Telugu News