Madhya Pradesh: పండంటి కాపురాన్ని కూల్చిన టమాటా.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఇల్లాలు

  • మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • భార్యకు తెలియకుండా వంటలో టమాటాలు వాడి చిక్కుల్లో పడ్డ భర్త
  • విషయం తెలిసి భర్తతో గొడవపడ్డ మహిళ
  • తీవ్ర ఆగ్రహంతో పిల్లలను తీసుకుని ఇల్లు వీడిన వైనం
  • ఆమె కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన యువకుడు
Madhya Pradesh man uses tomatoes to cook without asking wife she leaves home

ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టడమే కాకుండా కాపురాలు కూడా కూల్చేస్తున్నాయి. భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వాడిన ఓ వ్యక్తి కాపురం కూలిపోయింది. భర్తపై మండిపడ్డ ఆ ఇల్లాలు తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. 

సంజీవ్ బర్మన్ అనే వ్యక్తి స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇటీవల అతడు తన భార్యకు చెప్పకుండా వంటలో రెండు టమాటాలు వినియోగించాడు. ఆ తరువాత విషయం తెలిసి భార్య అతడిపై అగ్గిమీద గుగ్గిలమైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో ఆమె తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. భార్య కోసం చుట్టుపక్కల వెతికినా ఉపయోగం లేకపోవడంతో సంజీవ్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

More Telugu News