Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం.. ఈసారి పాదాలు నాకించారు!

  • ఇటీవల ఓ గిరిజన కూలీపై మూత్ర విసర్జన ఘటన
  • ఇప్పుడు చెప్పులతో చితకబాది పాదాలు నాకించిన నిందితులు
  • ఇద్దరు నిందితుల అరెస్ట్.. పరారీలో ఉన్న వారి కోసం వేట
Madhya Pradesh Man Forced To Lick Teens Feet

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటనలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల ఓ గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే జరిగిన మరో ఘటన ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన వ్యక్తులు అందులోనే అతడితో 17 ఏళ్ల కుర్రాడి పాదాలు నాకించి వికృత చేష్టలకు దిగారు. అంతకుముందు చెప్పులతో చితకబాదారు. కారులోనే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని డబరా ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటన వెనక ప్రతీకార చర్య ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

More Telugu News