Uttar Pradesh: మహిళ ప్రాణాలు తీసిన పెంపుడు ఒంటె

  • ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లా బస్గోయ్ గ్రామంలో వెలుగుచూసిన ఘటన
  • ఆదివారం ఒంటెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా మహిళ గొంతు నోటపట్టిన ఒంటె
  • ఊపిరాడక బాధితురాలి దుర్మరణం
UP woman dies in camel attack

పెంపుడు ఒంటెకు నీళ్లు పెడుతుండగా ఓ మహిళ అనూహ్య రీతిలో దుర్మరణం చెందింది. అకస్మాత్తుగా ఒంటె ఆమె గొంతును నోటకరిచి గట్టిగా నొక్కేయడంతో మహిళ ఊపిరాడక మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మృతురాలిని తోతా దేవిగా పోలీసులు గుర్తించారు. 

తోతా దేవి, ఆమె భర్త పప్పూ బఘేల్‌తో కలిసి బస్గోయ్ గ్రామంలో నివసిస్తుంటారు. ఆదివారం ఎప్పటిలాగే ఒంటెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. ఒంటె నోట చిక్కిన తోతా దేవీ ఆర్తనాదాలు విన్న వెంటనే ఇరుగు పొరుగు అక్కడికి చేరుకోగా అప్పటికే ఆమె మరణించింది.

More Telugu News