Indian Railways: త్వరలో ఘోర రైలు ప్రమాదమంటూ దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ

  • గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు లేఖ
  • మరో వారం రోజుల్లో ఒడిశా తరహా ప్రమాదం జరగనుందని హెచ్చరిక
  • హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలోనే జరుగుతుందని లేఖలో పేర్కొన్న వ్యక్తులు
Threatening letter to south central railway

దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు లేఖ వచ్చింది. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని, మరో వారం రోజుల్లో ఒడిశా తరహా రైలు ప్రమాదం జరగనుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రైలు ప్రమాదం హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలో చోటు చేసుకోనుందని లేఖలో హెచ్చరించారు. ఈ హెచ్చరిక లేఖ గతవారం అందినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖ విషయమై రైల్వే అధికారులు స్పందించవలసి ఉంది.

More Telugu News