Ramcharan: హేమాహేమీలతో రామ్ చరణ్... కొత్త యాడ్ కోసమా?

  • శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్న రామ్ చరణ్
  • ఇటీవలే రామ్ చరణ్ కు పుత్రికోత్సాహం
  • మరోవైపు యాడ్ ఫిలింతో గ్లోబల్ స్టార్ కోలాహలం 
Ram Charan latest projest with other stars

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే పుత్రికోత్సాహంతో హుషారుగా ఉన్న రామ్ చరణ్ ఓ యాడ్ లోనూ కనువిందు చేయనున్నారు. మీషో సంస్థ కోసం ఇతర అగ్రతారలతో కలిసి పనిచేసినట్టు తెలుస్తోంది. రణవీర్ సింగ్, దీపిక పదుకొణె, త్రిష వంటి స్టార్లు కూడా ఈ యాడ్ ఫిలింలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో 'షో మీ ద సీక్రెట్' పేరుతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దీంట్లో భారీ స్టార్లు ఉండడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.   

తన భర్త కనిపించడంలేదని దీపిక పదుకొణె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రోమో మొదలవుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ ఓ చేజింగ్ సీన్లో కనిపిస్తాడు. మరోవైపు రణవీర్ సింగ్ యాంగ్రీ లుక్ తో కనిపించగా, త్రిష కూడా దర్శనమిస్తుంది. మొత్తమ్మీద ఆ ప్రోమో ఓ భారీ యాక్షన్ చిత్రం స్థాయిలో ఉంది.

More Telugu News