Pune: నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్.. పోలీసు అధికారిపై విమర్శల వెల్లువ

  • పూణె‌లోని రైల్వే స్టేషన్‌లో పడుకున్న వారి ముఖంపై నీళ్లు జల్లి నిద్రలేపిన పోలీసు
  • పోలీసు అధికారి ప్రవర్తనపై నెట్టింట తీవ్ర విమర్శలు
  • ఘటనపై స్పందించిన రైల్వే మేనేజర్, బాధ కలిగిందని వ్యాఖ్య
  • నిబంధనలపై ప్రజలకు సరైన తీరులో అవగాహన కల్పించాలని సూచన
Police officer wakes up passengers sleeping on platform by spraying water on their faces

పూణెలోని రైల్వే స్టేషన్‌లో ఓ పోలీసు అధికారి ప్రవర్తనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై నిద్రపోతున్న వారి ముఖాలపై ఓ పోలీసు నీళ్లు జల్లి నిద్రలేపుతున్న వైనం జనాల్ని విస్తుపోయేలా చేస్తోంది. మానవత్వంపై ఏమైందని ఆవేదనతో ప్రశ్నించేలా చేస్తోంది. రూపేన్ చౌదరి అనే నెటిజన్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. మానవత్వం కనుమరుగైందనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. 

పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే మేనేజర్ స్వయంగా స్పందించారు. ‘‘ప్లాట్‌ఫామ్‌పై నిద్రించడం ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో ప్రయాణికులకు సరైన రీతిలో అవగాహన కలిగించాలి. అంతేకానీ, ఇలా అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఈ సంఘటన తీవ్రంగా బాధించింది’’ అని ఆయన కామెంట్ చేశారు.

More Telugu News